శంబర జాతర అశేష జనవాహిని 2018

శంబర పోలమ్మగ్రామదేవత పండగ. పేరుకు పండగ శంబర గ్రామానిదైనా ఉత్థరాంధ్ర మూడుజిల్లాలతోపాటు ఒడిషా,చత్తిస్గడ్ రాష్ట్రాల నుండి ఆశేషంగా నేటి నుండి పదివారాలపాటు విశేషంగా దర్శించుకుంటారు.దసరా పండగ మరుచటి వారం విజయనగరం పైడితల్లమ్మ పండగ జరిగితే,సంక్రాంతి తరువాత వారం పోలమ్మ పండగ జరగడం జిల్లా విశేషం.దూరప్రాంతాలలో ఉండి శంబర వెళ్ళలేని మన మితృలకోసం తల్లిని మీముందు తెస్తున్నాం.

శంబర శ్రీ కరకట్ట పొలమాంబ తల్లి యాత్ర సందర్భంగా అశేష జనవాహిని.





















శంబర పోలమ్మ అమ్మవారి విశిష్టత



శ్రీ శంబరపోలమాంబ

కళింగ ఆంధ్రుల ఆరాధ్య దైవము ఉత్తరంద్రుల కల్పవల్లిగ విరజిల్లుతున్న శ్రీశంబర పోలమాంబ జీవితచరిత్ర ఆశ్యర్యకరంతోపాటు ఆసక్తిని కలిగింస్తుంది. మహిమ స్వరూపిణిగా, శక్తిస్వరూపిణిగా ఘనతకెక్కిన శంబర గ్రామదేవత ఘట్టాలపై విభిన్న కథనాలు ప్రాచుర్యములో ఉన్నట్లు చరిత్రికారులు చెబుతున్నారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ ఆదిశక్తి స్వరూపిణి పార్వతీదేవి అవతారమే పోలేశ్వరియని ప్రతిఏట లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించి ముక్తిని పొందుతున్నారు.

తెలంగాణ ప్రాంతములో సమ్మక్క-సారక్క, అనకాపల్లిలో నూకాలంబ, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల మాదిరిగా శంబర పోలమ్మ సంబరాలు ఘనముగా జరుగుతాయి. పార్వతీపురం గిరిజన ఉపప్రణాలికా ప్రాంతానికి చెందిన మక్కువ మండలం శంబర ప్రాంతము పూర్వము దండకారణ్య ప్రాంతముగా ఉండేది. శంబాసురుడనే రాక్షసుడు ఈప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఇతదూ మహా పరాక్రమవంతుడు, మాయావి, ఈయన పరిపాలనలో ప్రజలు, మునులు, ఘోరమైన చిత్రహింసలు అనుభవించేవారు. రాక్షస రాజు బారినుంచి రక్షించమని అప్పటి ప్రజలు, తపస్సంపన్నులు శక్తిస్వరూపిణిని వేడుకోవడముతో ఆమె పోలేరేశ్వరిగా అవతారమెత్తి, శంబాసుర రాక్షసుడుని సంహరించి సుఖ శాంతులు కలుగజేసింది. అప్పటినుండి పోలేశ్వరి పోలమాంబగ ప్రాచుర్యము పొంది ఈ ప్రాంతపు ఆరాధ్య దైవముగా పూజలందుకొంటుంది. శంబాసుర రాక్షసరాజు పరిపాలనలో ఈ ప్రాంతము ఉండటంతో ఈ ప్రాంతానికి శంబర అని పేరువచ్చింది.


అమ్మవారి జననము:బాల్యము

సాలూరు పట్టణానికి 16 కిలోమీటర్లు, మక్కువ గ్రామానికి 6 కిలోమీటర్లు దూరంలో గోమిఖి నదీ పరీవాహక ప్రాంతాన శంబర గ్రామము కొండదొరలు కుటుంబంలో శక్తి స్వరూపిణిగా అవతరించింది. సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వర్గీయ పృకాపు అప్పన్నదొర దంపతులకు పోలేశ్వరి జన్మించింది. ఆవతారమూర్తి అగుటచే ఈమె మెరుపుతీగ వలే దేవతా స్త్రీవలే గ్రామస్తుల మధ్య బాల్యం నుంచే ప్రత్యేక జీవన విధానాన్ని కనబరిచింది. ఇంట్లో పనిపాట్లు ఎప్పుడు ముగించేదో ఎవరికీ అంతుబట్టేది కాదు. తల్లిదండ్రులకు, చిన్ననాటి నుంచి తనతో పెరిగిన మేనత్తకు తప్ప ఆమె ఎవ్వరికంట కనిపించేందుకు నిరాకరించేది. స్పష్టంగా ఆమెను ఎవరూ చూడలేక పోయేవారు. యుక్త వయసు వఛ్ఛేవరుకు ఇదే మాదిరిగా వైవిధ్యమైన జీవన విధానం కనబరిచిన ఆమెను పలు ప్రాంతాల ప్రజలు భక్తిభావాలతో కీర్తించడము ప్రారంభించారు.


అమ్మవారి పెళ్లిచూపులు

పోలేశ్వరికీ యుక్తవయస్సు రావడంతో ఆమెకు వివాహం చేయాలన్న తలంపు తల్లిదండ్రులకు విండృది. కుమార్తె జీవన విధానంలో అమె మానవ స్త్రీ కాదని వారు తెలుసుకున్నారు. అందువల్ల ఈమె వివాహం ఎలా జరుగుతిందోనని ఆదిసక్తి స్వరూపిణి పైనే భారం వేశారు. ఆ రోజుల్లో శంబర గ్రామ మునసబుగా గిరడ చిన్నం నాయుడు బాధ్యతలు వహించేవరు. ఒకనాడు నీలాటిఋవున ఆయన దంతాదావనం చేసుకుంటున్నరు. ఆ సమయంలో మోభాసా మామిడిపల్లికి చెందిన కొండదొర కులస్తులు ఆ గ్రామనాయుదుగారితో కలసి పెళ్ళి సంబంధం విషయమై వృరొక పట్టణానికి ప్రయాణం సాగిస్తున్నారు. నీలాట రేవున శంబర మునసబు వారికి ఎదురవ్వడంతో కుశలప్రశ్నలు సంభాషణలో పోలేశ్వరీ గుణగణాలను తెలుసుకున్నారు. అంతటిరో వరి ప్;రయ్/అణాన్ని విరమించుకొని పేకాపు అప్పన్నదొర ఇంటికి వెఅల్లి లాంచనప్రాయంగా పోలేశ్వరిని తమ కోడలుగా చేసుకొనేందుకు సంబంధం ఖాయం చేసుకున్నారు.


అమ్మవారి వివాహం

పోలేశ్వరి వివాహ లగ్నము సమీపిస్తున్న కొలది ఆ గ్రామ మునసబు చిన్నమ్నాయుడుతోపాటు చుట్టుఇప్రక్కల గ్రామాల ప్రజలంతా ఈ సారైనా ఆమెను చూడవచ్చని ఎంతో ఆనందించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. వివాహ లాంఛనాలకు అమె ఒప్పికోలేదు. గృహ జీవనానికి తాను పెళ్ళిచేసుకోవడంలేదని ముత్తైదువగా తాను నిర్వహించాల్సిన మహాకార్యమోకతి వున్నదని తల్లిదండ్రులకు ఆమె వివరించింది. ఎప్పుడూ వృదాంతి ధోరణిగా మాటలాడే కుమార్తె మాట ల్లోని మర్మాన్మి తల్లిదండ్రులు గ్రహించలేక పోయారు. వివాహ ముహూర్తసమయంలో పెళ్ళి పీటలపై ఆమె కూర్చొనక పెళ్ళికుమారుడితో ముట్టాబడిన మంగళసూత్రాలు, పూలదంశను ఒక పుణ్యస్త్రీతో తెప్పించుకొని ధరించింది.


అమ్మవారు భుమిలో కుంగి అవతారం చాలించుట

పోలేశ్వరి తాను మానవజన్మ ఎత్తి నిర్వర్తించాల్చిన పనులు పూర్తయినవని తలంచింది. తన తల్లి ఒడిలో చేరుకోవాలని అవతారాన్ని చాలించేందుకు భర్తతో సవ్వారిలో కూర్చొనేందుకు నిరకరించింది. అత్తవారింటికి పయణ్మైన సమయాన వాయువృగంతో మెరుపుతీగవలే పల్లకిలో ప్రవృశించింది. తనకు తోడుగా పృరంటాలుగా వచ్చేందుకు మేనత్త అయిన పెద్ద పోలమ్మను అంగీకరించినది, పల్లకి తలుపులు మూసుకిని వారు కూచొవడంతొ పోలేస్వరిని వూడాలన్న ఆసతో వున్న గ్రామస్తులకు నిరాశ ఎదురయ్యింది. పల్లకిని శంబర గ్రామం దాటి దక్షిణదిక్కుగా ఒక పర్లాంగు దూరం తీసుకువెళ్లగానీ గులివిందల పోలినాయుడు చెరువు, కిట్టలు తోటవద్ద సవ్వరిని దింపిఛ్చమని బోయిలకు మేబత్తచే ఆపించి ఆడ మరుగు నిమిత్తమని తలచి సవ్వారిని దించి బోయిలు దూరముగా పోయిరి .పోలేస్వరి మెరుపు వలృ బయటకు వచ్చి భుమాతను ప్రార్థించి దారిమ్మని కోరెను. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకంపనలు రేగి ఆ ప్రాంతంలో భూమి బీటలు వారడంతో కంఠము వరకు పోలేశ్వరి భూమిలోదిగబడెను. మేనత్త పెద్దపోలమ్మ భయబ్రాంరురాలై భక్తి శ్రద్ధలతో పోలేశ్వరిని ప్రార్థించి తనను ఇక్యం చేసుకొమ్మని కోరెను. ఆమె మహిమా ప్రభావంతో పెద్దపోలమ్మ భూమిలో పూర్తిగా దిగబడెను. అనంతరము అక్కడకు చేరిన బోయిలు అ ప్రాంతనికి చేరుకొని కంథము వరకు దిగివున్న పోలేస్వరిని చూచి ఆశ్చర్యం ఆందోళనతొ భయకంపితులైనారు. భయపడవలదని బోయిలకు అభయమిచ్చి ముందుగ గుఋఋఅముపై వెళుతున్న తన భర్తను గ్రామస్తులకు జరిగిన విషయాలను తెలిప్;ఇ ఈ ప్రాంతానికి తీసుకురమ్మని ఆగ్యాపించింది. బొయిలు చెప్పిన ప్రకారం ఆమె భర్తను గ్రామ ప్రజలు అప్రదేశానికి చేరుకొని అంతా చూసి ఆశ్చర్యముతో భక్తిశ్రద్ధలటో పోలేస్వరికి నమస్కరించారు. పోలేస్వరి తన భర్తను పిలిచి నీతో సమ్సారిక కష్తసుఖాలను పంచుకొనేందుకు ఈరోజే చేరొక కన్యతో వివహం జౌర్గుతుందని తెలిపెను. అలాగే ఈ గ్రామానికి శంబర గ్రామ డేవత లేనదున శంబరపోలమాంబగా పిలవబడుతూ గ్రామ దేవతపై అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులను సదా రక్షిస్తనని అభయమిచ్చెను. అలాగేగ్రామంలో తనను కొలిచే విధానాన్ని, క్రమాన్ని వవరించి భూమిలో కృంగి అవతారం చాలించెను. ఆమె చెప్పిన ప్రకారమే ఆ దినమే భర్తకు వివాహము జరిగెను. శక్తి స్వరూపిణిగా పోలమాంబ నమ్ముకున్న భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొంగుబంగారమై ముక్తిని ప్రసాదిస్తుందని చరిత్ర తెలుపుతుంది.


చివరిసారిగా అమ్మవారు పలికిన పలుకులు

  • శమ్బర గ్రామానికి గ్రామ దేవతదా కీర్తిస్తున్న తనను ప్రతీ ఏటా క్రమం తప్పకుండా పండగను తెచ్చి పూజించాలి.
  • తనను కొలిచి తెచ్చే రోజున ఆనాడు ఉదయము గ్రామములో ఉజ్జిడి తిరిగి చీడ పీడలను పారద్రోలాలి.
  • నా అంపక రోజున గ్రామములో చీడలు ప్రవేశించకుండా గ్రామము చుట్టూ పాలధార పోసి కట్టూకట్టవలెను.
  • సంక్రాంతి పండగనాడు తాను శంబర గ్రామములో ఉండాలి, ఆ రోజున తన పేరున మూలన మడపల్లు పెట్టి పేరంటాల్లకు పసుపు-కుంకుమ ఇవ్వాలి
  • పండగ సోమవారము రాత్రి కొండపల్లివలస దొరలచే తొలివేళ్లు జరపాలి. అనంతరము సింగిడీలు (మొక్కిబడులు) చెల్లించాలి.
  • భాగవత ప్రదర్శనలతో తనను అంపకం చేయాలి, అంపకం రోజున నేస్తపువారైన, ప్రయస్నేహితులున్నా, నాయకరం చేస్తున్న గిరిడి వారింటికి, అనంతరము కరణం గారింటికి తీసుకువెల్లి ఊరేగించమని ఆగ్యాపించి అవతారము చాలించెను-భూమిలో క్రుంగెను.


అమ్మవారి ప్రతిరూపాలు పోతుకుడెరాళ్లు

సంబర పోలమాంబ మహిమలు వర్ణింప శక్యము కానివి. ఆమె మహిమల్లో భాగంగా శంబర గ్రామాన్ని ఆనుకొని కొండపై వున్న రెండు పెద్దబండరాళ్లు పోతుకుడెరాళ్లుగా పిలుస్తూ పూజలందుకుంటున్నాయన్న సాక్ష్యాలు నేటికీ చ్వ్బుతునేచున్నారు. జలాశయంలో న్హాగమైన అమ్మవారి చెరువును నొళ్లించడానికి గ్రామములో ప్రతీ ఇంటివారిని ఏరును తోలుకొని రావాలని గ్రామపెద్దలు అపటి మునసబు గిరిడ చిన్నంనాయుడు ఆగ్యాపించారు. మొదటి రోజున ఊరందరూ తమ తమ ఎద్దులతో ఏరును తోలుకువెళ్లారు. అయితే పోలేశ్వరి తల్లిదండ్రులకు ఎద్దులేనందున ఏరును తోలుకు వెళ్లలేకపోయారు, తెల్లవారి పిలిపించి ఏ శిక్ష విధిస్తారోనని తల్లిదండ్రులు జన్నిపేకాపు అప్పన్నదొర దంపతులు దుఖ్ఖ్హించసాగారు. ఆ రాత్రి సమయంలో వారి కలలో పోలేశ్వరి కనిపించి త మేనత్త నల్లఎద్దుగా, తాను తెల్లఎద్దుగా అవతరించా మని హ్రామస్తులతోపాటు మీరు కూడా ఏరు తోలుకెళ్లమని చెప్పి అంతర్ధానమయ్యెను.వారు తిరిగి వచ్చి చూడగా దొడ్డిలో చూడముచ్చటయిన రెండు ఎద్దులు కనిపించాయి .వాటిని వారు ఏరుపోసి చెరువు వద్దకు తోలుకొనిపోగా అప్పటికే గ్రామస్థులు చెరువుపనిలో ఉన్నారు.జన్నికాపు అప్పన్నదొర ఏరు తోలుకొస్తుండడంతో వారికి ఎద్దులు ఎక్కడవని ఒకరినొకరు గుసగుస లాడుకోవడం మొదలైనది.. ఆ ప్రదేసానికి చేరేసరికి ఆ రెండు ఎద్దులు పులిలా గాండ్రిస్తూ పూసిన పూజ పెద్ద సర్పములా అక్కడివారికి కనిపించాయి.దీంతో గ్రామస్తులూ వారి వారి ఎద్దులూ ప్రాణభయముతో పరుగులెత్తాయి.విషయాన్ని తెలుసుకున్న మునసబు జరిగిన తప్పును ఒప్పుకొని క్షమించమని అప్పన్నదొర దంపతులను బ్రతిమాలాడరు.పోలేశ్వరి మహిమను మనషును ఎరిగిన తల్లిదండ్రులు ఆమెను ప్రార్థించి ఉగ్రరూపాన్ని విడిచిపెట్టమని ప్రాదేయపడ్డరు. పోలమాంబ శాంతించి తన మేనత్త పెద్దపోలమ్మతో ఎద్దులరూపములోనేకొండపైకెక్కి అక్కడరెండు పెద్దబండరాళ్లుగా మారిపోయారు.అప్పటినుంచి ఆ రాళ్లు అమ్మవారి ప్రతిరూపాలుగా భావిస్తు పూజలు జరుపుతున్నారు.నేటికీ వాటిని పోతుకుడెరాళ్లుగా పిలుస్తున్నారు.